కేసీఆర్‌కే కాదు.. మాకూ ఉపాయం ఉంది: ఈటల

ABN , First Publish Date - 2022-08-09T02:52:21+05:30 IST

కేసీఆర్‌కే కాదు.. మాకూ ఉపాయం ఉంది: ఈటల

కేసీఆర్‌కే కాదు.. మాకూ ఉపాయం ఉంది: ఈటల

మహబూబ్ నగర్: రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను స్పీకర్ 5 నిమిషాల్లో ఆమోదించారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారని చెప్పారు. దేవరకద్ర నియోజకవర్గంలో పల్లెగోస- బీజేపీ భరోసా కార్యక్రమానికి ఈటల రాజేందర్ హాజరైయ్యారు. వారంతా రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లాలని సూచించారు. రాజీనామా చేస్తున్నవారందరిదీ బీజేపీ దారే అన్నారు. కేసీఆర్‌కే కాదు.. తమకూ ఉపాయం ఉందన్నారు. మునుగోడులో మా స్ట్రాటజీని కేసీఆర్‌కు చూపిస్తామన్నారు. కేసీఆర్ హామీలు ఎన్నికలు జరిగే దగ్గరే అమలవుతాయన్నారు. 

Updated Date - 2022-08-09T02:52:21+05:30 IST