CM KCR పై ఈటల సంచలన కామెంట్స్
ABN , First Publish Date - 2021-07-26T23:25:04+05:30 IST
ఈటల.. సీఎం కేసీఆర్పై సంచలన కామెంట్స్ చేశారు.
కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరు కామెంట్స్ చేయడం.. దానికి ప్రత్యర్థి పార్టీ నేతలు కౌంటర్లు ఇవ్వడంతో ఈ ఎన్నిక మరింత హాట్ హాట్గా మారింది. నియోజకవర్గంలో మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఇవాళ కమలాపూర్ మండలం కానిపర్తిలో యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈటల.. సీఎం కేసీఆర్పై సంచలన కామెంట్స్ చేశారు.
అదంతా కేసీఆర్ వచ్చాకే..!
‘దుబ్బాక ఎన్నికను తలదన్నేలా వందల కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్.. హుజురాబాద్లో గెలవాలని అనుకుంటున్నారు. కేసీఆర్ వచ్చాకే ఓట్లు కొనుగోలు చేసే కొత్త ఒరవడి వచ్చింది. గ్రాడ్యుయేట్ ఓట్లను కూడా కొనుగోలు చేసే స్థాయికి కేసీఆర్ ఎదిగారు. తెలంగాణను 50 ఏళ్ళపాటు కేసీఆరే ఏలాలి అని అనుకుంటున్నారు’ అని ఈటల వ్యాఖ్యానించారు. ఈటల వ్యాఖ్యలపై జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.