ఈటల రాజేందర్‌కు ఊరట

ABN , First Publish Date - 2021-10-12T01:52:23+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నామినేషన్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఊరట లభించింది. రాజేందర్‌ పేరుతో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.

ఈటల రాజేందర్‌కు ఊరట

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నామినేషన్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఊరట లభించింది. రాజేందర్‌ పేరుతో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలనలో సరైన పత్రాలు లేకపోవడంతో ఇప్పలపల్లి రాజేందర్‌, ఇసంపల్లి రాజేందర్‌, ఇబ్బడి రాజేందర్‌ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. దీంతో ఈటల రాజేందర్‌కు ఊరట లభించినట్లయ్యింది. హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను 61 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా అందులో 19మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సీహెచ్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు. 61మంది మంది అభ్యర్థులు 92 నామినేషన్ల సెట్లు దాఖలు చేశారు. పరిశీలనలో నిబంధనల ప్రకారం లేని 19 మంది అభ్యర్థుల 23 సెట్ల నామినేషన్లను తిరస్కరించారు. ప్రస్తుతం బరిలో ఉన్న 42 మంది అభ్యర్థులు ఉన్నారని, ఈ నెల 13 వరకు నామినేషన్‌ ఉపసంహరణకు గడువు ఉంది.

Updated Date - 2021-10-12T01:52:23+05:30 IST