భూ ప్రక్షాళన పేరుతో కేసీఆర్‌ మాయ చేస్తున్నారు: ఈటల

ABN , First Publish Date - 2021-12-28T23:15:13+05:30 IST

భూ ప్రక్షాళన పేరుతో కేసీఆర్‌ మాయ చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. పేద రైతులకు కేసీఆర్‌ అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

భూ ప్రక్షాళన పేరుతో కేసీఆర్‌ మాయ చేస్తున్నారు: ఈటల

వరంగల్: భూ ప్రక్షాళన పేరుతో కేసీఆర్‌ మాయ చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. పేద రైతులకు కేసీఆర్‌ అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వ భూములు కూడా పట్టాకాని పరిస్థితి నెలకొందన్నారు. కొండ నాలుకకు మందేస్తే..ఉన్న నాలుక ఊడినట్లుంది భూ ప్రక్షాళన ధరణి వల్ల లక్షల ఎకరాల భూములు మాయం అవుతున్నట్లు ఆరోపించారు. సైనికులు, స్వాతంత్ర్య సమరయోధుల భూములను నిషేధిత జాబితాలో పెట్టారని చెప్పారు. ధరణి సమస్యలపై ఎమ్మార్వో, ఆర్డీవోలకూ అధికారం లేకుండా పోయిందన్నారు. గతంలో కంటే ఎక్కువ అవినీతి జరిగే ప్రమాదముందని అనుమానం వ్యక్తం చేశారు. ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-28T23:15:13+05:30 IST