ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-08-08T20:55:00+05:30 IST
ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు
కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘హుజురాబాద్లో పోటీ చేద్దాం. కేసీఆర్, హరీష్ వస్తారా? దమ్ముంటే నిజాయితీగా ఓట్లు వేయించుకోండి. ప్రలోభాలు, దావతులు ఆపండి’’ అని వ్యాఖ్యలు చేశారు. పోలీస్, ఇంటలిజెన్స్ వాళ్ళను వెనక్కితీసుకోండని, నా మనుషులను బయపెట్టడం ఆపండన్నారు. కనీసం తన డిపాజిట్ను టచ్ చేయగలరా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్కి హుజురాబాద్ దళితుల మీద ప్రేమ లేదు కానీ వారి ఓట్ల మీద మాత్రమే ప్రేమ ఉందన్నారు. టీఆర్ఎస్ నేతల మాటల్లో, చేతల్లో నిజాయితీ లేదన్నారు.