నేను రాజీనామా చేసిన తర్వాత కొత్త పథకాలు: ఈటల

ABN , First Publish Date - 2021-07-22T01:14:54+05:30 IST

నేను రాజీనామా చేసిన తర్వాత కొత్త పథకాలు: ఈటల

నేను రాజీనామా చేసిన తర్వాత కొత్త పథకాలు: ఈటల

కరీంనగర్: జిల్లాలోని ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక్క హుజురాబాద్ నియోజక వర్గానికే కాదని, రాష్ట్రంలో అందరికి పెన్షన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్‌లో తాను రాజీనామా చేసిన తర్వాత కొత్త పథకాలు వస్తున్నాయన్నారు. దళితులకు ముఖ్యమంత్రి, మూడు ఎకరాల భూమి ఇస్తా అని కేసీఆర్ మోసం చేసిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి ఇచ్చి లాక్కున్నడని దుయ్యబట్టారు. సిఎమ్ఓ కార్యాలయంలో దలితులు లేరన్నారు. రూ.10లక్షలు రాష్ట్రంలోని దళితులు అందరికీ ఇవ్వాలని సూచించారు.

Updated Date - 2021-07-22T01:14:54+05:30 IST