రోశయ్య దాదాపు 60 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉన్నారు: ఈటల
ABN , First Publish Date - 2021-12-04T19:11:53+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 55 నుంచి 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాలలో ఉన్నారని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 55 నుంచి 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాలలో ఉన్నారని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. 15 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారన్నారు. 2004 నుంచి 2014 వరకూ రోశయ్యతో కలిసి శాసనసభలో కాలం గడిపామని ఈటల పేర్కొన్నారు. ఉద్యమం సమయంలో యూనివర్సిటీలో రబ్బర్ బుల్లెట్స్ను ఆపమని చెప్పింది రోశయ్యేనన్నారు. యువకులకు ఆయన జీవితం ఆదర్శమని ఈటల పేర్కొన్నారు.