Etala vs Kaushik: బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
ABN , First Publish Date - 2022-08-05T17:13:42+05:30 IST
హుజురాబాద్లో బీజేపీ (BJP) నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు
కరీంనగర్ (Karimnagar): హుజురాబాద్లో బీజేపీ (BJP) నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. జమ్మికుంట, హుజురాబాద్లో అరెస్టులు కొనసాగుతున్నాయి. జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి (Krishna Reddy)ని అరెస్ట్ చేశారు.
హుజురాబాద్ అంబేద్కర్ చౌక్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కాసేపట్లో చౌక్ వద్దకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి రానున్నారు. హుజురాబాద్ అభివృద్ధిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్కు సవాల్ చేసిన విషయం తెలిసిందే. వేదిక మీద టీఆర్ఎస్ నేతలు రెండు కుర్చీలు వేశారు. చౌక్ దగ్గరకు భారీగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను కౌశిక్ రెడ్డి తరలిస్తున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను మాత్రం పోలీసులు అరెస్టు చేస్తున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గం సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తుతోంది. అభివృద్ధిపై చర్చకు రావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajendar)కు సవాల్ విసిరారు. ఈటెలకు దమ్మూ, ధైర్యం ఉంటే చర్చకు రావాలన్నారు. ఆయన హుజురాబాద్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. చర్చకు రమ్మంటే అల్లర్లు అని మాట్లాడుతున్నారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. దీనికి ప్రతిగా బీజేపీ నాయకులు ప్రెస్మీట్లు పెట్టి తమ వాదన వినిపించారు. ఈ అంశంపై జెండాలు, ఫ్లెక్సీలు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా ఏర్పాటు చేశారు.