తెలంగాణలో బీజేపీ ప్రళయం రాబోతోంది:ఈటల
ABN , First Publish Date - 2021-12-17T22:52:15+05:30 IST
లంగాణలో బీజేపీ ప్రళయం రాబోతోందని.. ఈ ప్రళయాన్ని తట్టుకోవడం సీఎం కేసీఆర్ వల్ల కాదని మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రంగారెడ్డి: తెలంగాణలో బీజేపీ ప్రళయం రాబోతోందని.. ఈ ప్రళయాన్ని తట్టుకోవడం సీఎం కేసీఆర్ వల్ల కాదని మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కోహెడలో బీజేపీ శిక్షణా తరగతుల్లో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఈటల మాట్లాడుతూ..‘‘కేసీఆర్ మీద ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. కేసీఆర్ వ్యూహాలు తెలిసినవాడిని. ఆయన ఎంత గట్టిగా మాట్లాడుతాడో అంత పిరికివాడు. ప్రగతి భవన్ ఇనుప కంచెలు తెగిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. హుజూరాబాద్ ప్రజలు కొట్టిన దెబ్బకు వచ్చి ధర్నాచౌక్లో పడ్డాడు. హుజురాబాద్ దెబ్బకు భూమిమీదకు, ఫాంహౌస్ నుంచి బయటికి వచ్చాడు. అటు సూర్యుడు ఇటు ఉదయించినా కేసీఆర్ మళ్లీ గెలవడు. కేసీఆర్ కాళ్లు మెక్కితే.. అన్ని తప్పులు ఒప్పవుతాయి. మంత్రిగా ఉండి కూడా ధర్నాలు చేసిన వారికి మద్దతు తెలిపిన ప్రజల కనీళ్లకు పరిష్కారం బీజేపీ. పవర్ కోసం కాదు.. ప్రజల కోసం బీజేపీ. బీజేపీ వేగం పెంచాలి’’ అని నాయకులకు, కార్యకర్తలకు ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.