బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేసీఆర్ కుట్ర: ఈటల

ABN , First Publish Date - 2022-03-13T20:05:17+05:30 IST

సింగరేణి ప్రైవేటీకరణలో కేంద్రం పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు.

బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేసీఆర్ కుట్ర: ఈటల

పెద్దపల్లి: సింగరేణి ప్రైవేటీకరణలో కేంద్రం పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌ను ప్రైవేట్‌పరం చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మాటలకు, చేతలకు పొంతన ఉండదన్నారు. సింగరేణిలో అవినీతి పెరిగిపోయిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే బాధ్యత బీజేపీపై ఉందని ఈటల రాజేందర్ అన్నారు.

Updated Date - 2022-03-13T20:05:17+05:30 IST