నాకు వచ్చిన కష్టం శత్రువుకు కూడా రావద్దు: ఈటల

ABN , First Publish Date - 2021-11-04T00:09:35+05:30 IST

ఉప ఎన్నికలో హుజూరాబాద్‌ ప్రజలను అన్ని రకాలుగా భయబ్రాంతులకు గురి చేశారని, తనపై కుట్రలు చేసిన వారు కుట్రలతోనే నాశనమైపోతారని

నాకు వచ్చిన కష్టం శత్రువుకు కూడా రావద్దు: ఈటల

హుజూరాబాద్‌: ఉప ఎన్నికలో హుజూరాబాద్‌ ప్రజలను అన్ని రకాలుగా భయబ్రాంతులకు గురి చేశారని, తనపై కుట్రలు చేసిన వారు కుట్రలతోనే నాశనమైపోతారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు వచ్చిన  కష్టం శత్రువుకు కూడా రావద్దన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో రెండు గుంటల మనిషి 400 కోట్లు ఎలా ఖర్చుపెట్టాడని ప్రశ్నించారు. ఈ ఎన్నికలో కేసీఆర్‌ అహంకారంపై ప్రజలు గెలిచారని తెలిపారు. తాను ఇంతకు ముందు కేసీఆర్‌ బొమ్మపెట్టుకుని పోటీ చేసినప్పటి కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించాని చెప్పారు. బెదిరింపులను లెక్క చేయకుండా హుజూరాబాద్‌ ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెప్పారన్నారు. హుజూరాబాద్‌ ప్రజలు గుండెను చీల్చి, తమ ఆత్మను ఆవిష్కరించి తనను గెలిపించారని కొనియాడారు. ఉప ఎన్నికలో కులాల వారీగా చీలిక తెచ్చినా, ప్రలోభాలకు గురి చేసినా హుజూరాబాద్‌ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని విజయాన్ని అందించారని ఈటల రాజేందర్ తెలిపారు.


Updated Date - 2021-11-04T00:09:35+05:30 IST