త్యాగం లేకపోతే వ్యర్థం: ఈటల రాజేందర్
ABN , First Publish Date - 2022-07-08T22:56:00+05:30 IST
మానవ సమాజం త్యాగాల పునాదులపై ఏర్పడిందని, త్యాగం లేకపోతే వ్యర్థమని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
ఢిల్లీ: మానవ సమాజం త్యాగాల పునాదులపై ఏర్పడిందని, త్యాగం లేకపోతే వ్యర్థమని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఐ స్టాండ్ ఫర్ వారియర్స్ కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయహో ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో పుడతారు, చస్తారు.. కానీ కొందరే గుర్తుంటారని పేర్కొన్నారు. త్యాగధనులను గుర్తు చేసుకోవాలని సూచించారు. ఆగస్ట్ 15న మధ్యాహ్నం 12 గంటలకు దేశ ప్రజలంతా లేచి నిలబడి, జాతీయ గీతం అలాపించాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.