MLA Etala: మునుగోడులో టీఆర్ఎస్ గెలవదు..

ABN , First Publish Date - 2022-09-12T21:25:31+05:30 IST

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

MLA Etala: మునుగోడులో టీఆర్ఎస్ గెలవదు..

మేడ్చల్‌, (హైదరాబాద్): బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajendar) టీఆర్ఎస్ ప్రభుత్వం (TRS Govt.)పై తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తల్లకిందులుగా తపస్సు చేసినా.. మునుగోడు (Munugodu)లో టీఆర్ఎస్ గెలవదని జోస్యం చెప్పారు. బీజేపీని గెలిపించాలని మునుగోడు ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఫ్యూజ్ పీకేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. విద్యుత్ చార్జీలు పెంచి కేసీఆర్ సర్కార్ పేదల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన చేతకాని సీఎం కేసీఆర్ ఆ నెపాన్ని కేంద్రంపై రుద్దతున్నారని ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.


కాగా అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరు కాలేదు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నేపథ్యంలో ఈటల అసెంబ్లీకి రాలేదు. సోమవారం నుంచి బండి సంజయ్‌ నాలుగో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభమైంది. కుత్బుల్లాపూర్‌ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు పాదయాత్ర సాగనుంది. 10 రోజులు, 115 కిలోమీటర్లు జరుగుతుంది. ముందుగా చిత్తారమ్మా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. 

Updated Date - 2022-09-12T21:25:31+05:30 IST