చావనైనా చస్తా కానీ.. కేసీఆర్కు లొంగను: ఈటల
ABN , First Publish Date - 2021-10-13T20:30:31+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కరీంనగర్ జిల్లా: ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం జమ్మికుంటలో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన మాట్లాడుతూ డబ్బుకు ఓట్లు వేస్తారనే చిల్లర ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని, చావనైనా చస్తా కానీ.. సీఎంకు లొంగనని స్పష్టం చేశారు. తనతో ఉండేవాళ్లకు డబ్బుల ఆశలు చూపుతున్నారని మండిపడ్డారు. కొడంగల్, నారాయణఖేడ్, హుజుర్నగర్, నాగార్జు సాగర్లో నడిచినట్టు ఇక్కడ నడవదన్నారు. తెల్లబట్టలో పసుపు పెట్టి, డబ్బులు ఇచ్చి ఓటు వేయాలని ప్రమాణం చేయించుకుంటారన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి హరీశ్ రావుకు డబ్బు సంచులు ఇస్తున్నారని ఈటల ఆరోపించారు.