షర్మిల సంకల్ప సభకు పోలీసుల ఆంక్షలు
ABN , First Publish Date - 2021-04-10T00:00:52+05:30 IST
వైఎస్ షర్మిల సంకల్ప సభకు పోలీసుల ఆంక్షలు విధించారు. బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారని షర్మిల అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం: వైఎస్ షర్మిల సంకల్ప సభకు పోలీసుల ఆంక్షలు విధించారు. బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారని షర్మిల అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నయాబజార్ కాలేజీ దగ్గర వాహనాలను పోలీసులు ఆపేస్తున్నారు. దీంతో సభకు 4 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మీటింగ్కు ఆటంకాలు కల్పించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని షర్మిల అభిమానుల మండిపడుతున్నారు.
మరోవైపు డీజీపీ మహేందర్రెడ్డిపై షర్మిల అనుచరుడు కొండా రాఘవరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. డీజీపీ టీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని దుయ్యబట్టారు. సభకు వచ్చేవారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? అని కొండా రాఘవరెడ్డి ప్రశ్నించారు.