కొవిడ్‌ బాధితులకు హెల్ప్‌లైన్‌ కేంద్రం ఏర్పాటు

ABN , First Publish Date - 2021-05-16T05:26:35+05:30 IST

కొవిడ్‌ బాధితులకు అత్యవసర సమాచారాన్ని అందజేసేందుకు టెక్కలిలోగల సెంచూరియన్‌ యూనివర్శిటీలో ‘సెంచూరియన్‌ కొవిడ్‌ హెల్ప్‌లైన్‌’ పేరిట కేంద్రాన్ని ప్రారంభించినట్టు యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు వెల్లడించారు.

కొవిడ్‌ బాధితులకు హెల్ప్‌లైన్‌ కేంద్రం ఏర్పాటు

   సెంచూరియన్‌ యూనివర్శిటీ వీసీ రాజు వెల్లడి

నెల్లిమర్ల, మే 15: కొవిడ్‌ బాధితులకు అత్యవసర సమాచారాన్ని అందజేసేందుకు టెక్కలిలోగల సెంచూరియన్‌ యూనివర్శిటీలో ‘సెంచూరియన్‌ కొవిడ్‌ హెల్ప్‌లైన్‌’ పేరిట కేంద్రాన్ని ప్రారంభించినట్టు యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు వెల్లడించారు. ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడారు. ఈ కేంద్రంలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఒడియా భాషలు మాట్లాడే సుమారు 50 మంది స్వచ్ఛంద కార్యకర్తలు పనిచేస్తున్నారని చెప్పారు. ఈ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 9059810827గా తెలియజేశారు. సెంచూరియన్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ డీఎన్‌ రావు, డాక్టర్‌ చైతన్య, డాక్టర్‌ గోపీనాథ్‌, డాక్టర్‌ ఆచార్యులు, డాక్టర్‌ అనితా పాత్రో ఆధ్వర్యంలో ఈ సహాయ కేంద్రం నడుస్తున్నదని ఆయన తెలిపారు. టెక్కలి యూనివర్శిటీతో పాటు ఒడిశాలోని పర్లాఖిమిడి, తెలంగాణ సెంచూరియన్‌ యూనివర్శిటీల సమన్వయంతో నడుపుతున్నట్లు ఆయన చెప్పారు.


Updated Date - 2021-05-16T05:26:35+05:30 IST