టీడీపీ పరిశీలకుని క్యాంప్ ఆఫీసు ఏర్పాటు
ABN , First Publish Date - 2022-08-12T06:17:38+05:30 IST
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీని ప్రగతి పథంలో నడిపించేందుకు నెలలో 15 రోజులు నియోజకవర్గంలో పర్యటిస్తానని టీడీపీ రాష్ట్ర నాయకులు ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిశీలకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలిపారు.
నెలలో 15 రోజులు నియోజకవర్గంలో పర్యటిస్తా
టీడీపీ పరిశీలకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు
ఎర్రగొండపాలెం, ఆగస్టు 11 : ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీని ప్రగతి పథంలో నడిపించేందుకు నెలలో 15 రోజులు నియోజకవర్గంలో పర్యటిస్తానని టీడీపీ రాష్ట్ర నాయకులు ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిశీలకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలిపారు. ఎర్రగొండపాలెంలో గురువారం టీడీపీ పరిశీలకులు కోటేశ్వరరావు తమ క్యాంప్ ఆఫీసును ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పర్యటిస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారన్ననరు. ఈ కార్యక్రమంలో జడ్పీమాజీ ఉపాధ్యక్షులు డాక్టరు మన్నె రవీంద్ర, మండల కమిటీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, మాజీ అధ్యక్షులు వడ్లమూడి లింగయ్య, రైతు అధ్యక్షులు చిట్యాల వెంగళరెడ్డి, కొత్త భాస్కర్ పాల్గొన్నారు.