రాష్ట్ర వ్యాప్తంగా 6,900 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
ABN , First Publish Date - 2020-04-10T11:28:17+05:30 IST
రైతుల ప్రయోజాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం 6,900 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం
స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి
బీర్కూర్, ఏప్రిల్ 9: రైతుల ప్రయోజాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం 6,900 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గురువారం బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో పోచారం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రేషన్కార్డులు లేని నిరుపేదలకు ఉచితంగా 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలు అమ లులో ఉన్నాయన్నారు.
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. సుమారు 40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారన్నారు. రైతులుఎవ్వరు కూడా భయాందోళన చెందొద్దని, ప్రతీ గింజను కొనుగోలు చేస్తారన్నారు. వరి ధాన్యంతో పాటు మొక్కజొన్న, పొద్దు తిరుగుడు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామ న్నారు. ఈ కార్యక్రమంలో మైలారం సొసైటీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, నాయకులు అప్పారావు, రాంబాబు, పడితె రాజు, శంకర్ సింగ్, దీకొండ మురళి, తదితరులున్నారు.