చిత్తూరు జిల్లాలో 106 వ్యాక్సినేషన్‌ సెంటర్ల ఏర్పాటు

ABN , First Publish Date - 2021-03-08T05:03:31+05:30 IST

జిల్లా వ్యాప్తంగా 106 కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

చిత్తూరు జిల్లాలో 106 వ్యాక్సినేషన్‌ సెంటర్ల ఏర్పాటు

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 7: జిల్లా వ్యాప్తంగా 106 కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని కేంద్రాల్లో ఈ నెల 22వ తేదీ వరకు వ్యాక్సిన్‌ వేస్తారన్నారు. 82 ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగానూ, 24 ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్క డోస్‌కు రూ.250 తీసుకుని వ్యాక్సిన్‌ వేస్తారని ఆయన చెప్పారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 60 సంవత్సరాలు పైబడిన వారు, 45-59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి దీర్ఘకాలిక వ్యాధులున్న వారు వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని కలెక్టర్‌ చెప్పారు. 

Updated Date - 2021-03-08T05:03:31+05:30 IST