రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలు: జేసీ
ABN , First Publish Date - 2020-03-28T10:11:39+05:30 IST
జిల్లాలో ఈ నెల 29నుంచే రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరుకు లు ప్రజలకు పంపిణీ చేస్తామని జేసీ లక్ష్మీశ
కార్పొరేషన్, (కాకినాడ) మార్చి 27: జిల్లాలో ఈ నెల 29నుంచే రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరుకు లు ప్రజలకు పంపిణీ చేస్తామని జేసీ లక్ష్మీశ తెలిపా రు. శుక్రవారం కమిషనర్ కోనా శశిధర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి పాల్గొన్న జేసీ అనంతరం విలేకర్లతోమాట్లాడుతూ జిల్లాలో సుమారు 15లక్షల బియ్యంకార్డుదారులకు సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బియ్యంతోపాటు కందిపప్పు ఉచితంగా ఇస్తామన్నారు. కార్డులు అందనివారు ఆధార్ కార్డు తీసుకెళ్లి సరుకులు తీసుకోవచ్చన్నారు.