ఈఎస్‌ఐ టెలీహెల్త్‌ సర్వీసెస్‌పై విచారణ

ABN , First Publish Date - 2020-02-22T08:08:59+05:30 IST

రాష్ట్ర ఈఎ్‌సఐలో టెలీహెల్త్‌ సర్వీసెస్‌, సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ల నిర్వహణలో జరిగిన కుంభకోణంపై విచారణ జరిపించాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ సీపీఎం కార్యదర్శి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

ఈఎస్‌ఐ టెలీహెల్త్‌ సర్వీసెస్‌పై విచారణ

గ్రేటర్‌ హైదరాబాద్‌ సీపీఎం కార్యదర్శి శ్రీనివాస్‌ డిమాండ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఈఎ్‌సఐలో టెలీహెల్త్‌ సర్వీసెస్‌, సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ల నిర్వహణలో జరిగిన కుంభకోణంపై విచారణ జరిపించాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ సీపీఎం కార్యదర్శి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈఎ్‌సఐ కుంభకోణాన్ని విచారిస్తున్న ఏసీబీ ఈ విషయాన్ని వదిలేసిందన్నారు. టోల్‌ఫ్రీ హెల్త్‌, ఈసీజీ, సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎంప్లాయుస్‌, జర్నలిస్టు హెల్త్‌ స్కీమ్‌లో కూడా కుంభకోణం జరిగిందని దానిపై కూడా ఏసీబీ విచారణ జరిపించాలన్నారు.

Updated Date - 2020-02-22T08:08:59+05:30 IST