పట్టణ అభివృద్ధికి పాటు పడాలి:ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-05-29T00:09:05+05:30 IST

మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వీడి పట్టణ అభివృద్ధికి పాటు పడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

పట్టణ అభివృద్ధికి పాటు పడాలి:ఎర్రబెల్లి

హన్మకొండ జిల్లా:  మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వీడి పట్టణ అభివృద్ధికి పాటు పడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 5వ విడత పల్లె-పట్టణ ప్రగతిపై హన్మకొండ, వరంగల్ జిల్లా స్థాయి సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మాట్లాడారు.గతంలో కేవలం గంగాదేవి పల్లికే అవార్డులు వచ్చేవని చెప్పారు.ప్రస్తుతం 20గ్రామాలకు ఉత్తమ విలేజ్ అవార్డు లు వస్తున్నాయన్నారు. దేశంలో 500గ్రామాలు సెలెక్ట్ చేస్తే అందులో అన్నీ కూడా తెలంగాణలోనే ఉన్నాయన్నారు.అభివృద్ధి కానీ వాటి గురించి కాకుండా అభివృద్ధి చెందిన వాటిపై మాట్లాడాలని సూచించారు.వైకుంఠ, నర్సరీ, డంపింగ్ యార్డ్‌లు గతంలో ఉండేనా ఇది కదా తెలంగాణలో వచ్చిన మార్పు అన్నారు.ప్రతి ప్రజా ప్రతినిధుల నిధుల నుంచి ప్రతి ఏటా 10శాతం హరితహారానికి వెచ్చిస్తున్నామని చెప్పారు.సర్పంచ్‌లకు రావాల్సిన బకాయి ఫండ్స్ మంజూరు చేస్తామన్నారు.ఉపాధి హామీ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు.100మంది ఉన్న గ్రామాలకు కూడా ప్రతి ఏటా రూ.5లక్షలు  మంజూరు చేస్తున్నామని  ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు.

Updated Date - 2022-05-29T00:09:05+05:30 IST