నిరంతర సాధనతో సైన్స్‌లో రాణించాలి

ABN , First Publish Date - 2021-02-26T06:09:33+05:30 IST

సైన్స్‌లో రాణించడానికి నిరంతర సాధన అవసరమని ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అ న్నారు.

నిరంతర సాధనతో సైన్స్‌లో రాణించాలి

ఉపకులపతి జగన్నాథరావు 

దివాన్‌చెరువు, ఫిబ్రవరి 25: సైన్స్‌లో రాణించడానికి నిరంతర సాధన అవసరమని ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అ న్నారు. నన్నయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ. ఇంజనీరింగ్‌ కళాశాలలను వీసీ గురు వారం పరిశీలించారు. ఆయా కళాశాలలోని రికార్డులను పరిశీలించి బోధనా పద్ధతుల వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ సైన్స్‌ రంగంలో గొప్ప పరిశోధకులుగా, అధ్యాపకులుగా, శాస్త్రవేత్తలుగా స్థిరపడాలని సూచించా రు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్‌ కె.రమణేశ్వరి, వి.పెర్సిస్‌,  అధ్యాపకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-26T06:09:33+05:30 IST