అవగాహనతో కరోనాను తరిమికొడదాం
ABN , First Publish Date - 2022-01-25T03:55:09+05:30 IST
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అవగాహనతో కలసి కట్టుగా తరిమికొడదామని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు.
నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి
కోట, జనవరి 24 : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అవగాహనతో కలసి కట్టుగా తరిమికొడదామని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. విద్యానగర్లోని నేదురుమల్లి సుబ్బరామిరెడ్డి కళాభవన్లో సోమవారం ఎన్బీకేఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ శిబిరంలో 950 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయకుమార్రెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ గాది శ్రీనివాస్, హరికృష్ణ, కోఆర్డినేటర్ రాజేష్, ఎన్సిసి ఆఫీసర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.