ఈపీఎస్ వర్సెస్ ఓపీస్...

ABN , First Publish Date - 2020-08-15T21:00:54+05:30 IST

అధికార అన్నా డీఎంకేలో ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ముఖ్యమంత్రి పళని స్వామికి, డిప్యూటీ సీఎం

ఈపీఎస్ వర్సెస్ ఓపీస్...

చెన్నై : అధికార అన్నా డీఎంకేలో ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ముఖ్యమంత్రి పళని స్వామికి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వానికి మధ్య సీఎం పదవి విషయంలో తీవ్ర పోటీ నెలకొన్నట్లు సమాచారం. వచ్చే యేడాదిలో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా సీఎం అభ్యర్థిగా తన పేరును ప్రకటించాలంటూ పన్నీర్ సెల్వం తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయంలోనే సీఎం పళని స్వామికి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


ఇదే టార్గెట్‌గా డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఇంట్లో శనివారం కొందరు మంత్రులు సమావేశమైనట్లు సమాచారం. ఈ సమావేశం మొత్తం రెండు అంశాల చుట్టే తిరిగింది. మొదటిది వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కాగా... రెండోది ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చ. సీఎం అభ్యర్థిగా తన పేరును ప్రకటించాలని పన్నీర్ సెల్వం తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్లు ఓ వర్గం పేర్కొంది. అంతేకాకుండా పన్నీర్ సెల్వమే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఏకంగా పోస్టర్లు కూడా వెలిశాయి. 

Updated Date - 2020-08-15T21:00:54+05:30 IST