హైదరాబాద్లో ఎపిక్ ఎక్సలెన్స్ కేంద్రం
ABN , First Publish Date - 2020-02-21T06:39:44+05:30 IST
ప్రపంచవ్యాప్తం గా కంపెనీలకు డాక్యుమెంట్ రివ్యూ, డేటా నిర్వహణ, డేటా ఈ-డిస్కవర్ వంటి లీగల్ సేవలను అందిస్తున్న
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రపంచవ్యాప్తం గా కంపెనీలకు డాక్యుమెంట్ రివ్యూ, డేటా నిర్వహణ, డేటా ఈ-డిస్కవర్ వంటి లీగల్ సేవలను అందిస్తున్న అమెరికా లీగల్ టెక్ కంపెనీ ఎపిక్ హైదరాబాద్లో ఎక్సలెన్స్ కేంద్రాన్ని (సీఓఈ) ప్రారంభించింది. దాదాపు పదిహేను దేశాల్లో టెక్నాలజీ ఆధారంగా సేవలు అందిస్తున్న ఎపిక్ హైదరాబాద్లో కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా భారత్లోకి అడుగుపెట్టింది. హైదరాబాద్లోని కేంద్రం నుంచి ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్న ఖాతాదారులకైనా, ఏ సమయంలోనైనా సేవలు అందిస్తుందని ఎపిక్ ప్రెసిడెంట్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ విశాల్ చిబ్బర్ తెలిపారు. ప్రస్తుతం 450 మంది నిపుణులు ఉన్నారని, ఇందు లో 800 మందికి పైగా పనిచేసేందుకు సదుపాయాలు ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎపిక్ 80 కార్యాలయాలు, 14 డేటా సెంటర్లను కలిగి ఉందని చెప్పారు.