ఈపీడీసీఎల్ ఉద్యోగుల నిరసన
ABN , First Publish Date - 2022-08-09T07:00:56+05:30 IST
విద్యుత్ సవరణ బిల్లు 2022ను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు సోమవారం ఆందోళన చేపట్టారు.
విద్యుత్ సవరణ బిల్లును నిలిపివేయాలని డిమాండ్
అనకాపల్లి టౌన్, ఆగస్టు 8: విద్యుత్ సవరణ బిల్లు 2022ను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు సోమవారం ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఏపీ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. సవరణ బిల్లు నిలిపివేయడంతో పాటు సహజ వనరులను ప్రైవేటుపరం చేయవద్దని నినాదాలు చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎ.నూకరాజు, కార్యదర్శి జెఆర్.ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.