దుర్గగుడి సిబ్బందికి ఈఓ కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2022-05-21T17:39:10+05:30 IST

దుర్గగుడి సిబ్బందికి ఈఓ పలు ఆదేశాలు జారీ చేశారు. ఇంద్రకీలాద్రిపై పని చేసే ఉద్యోగులు, సిబ్బంది ఇక నుంచి తెలుపు రంగు చొక్కా, పంచె కట్టకపోతే

దుర్గగుడి సిబ్బందికి ఈఓ కీలక ఆదేశాలు

విజయవాడ : దుర్గగుడి సిబ్బందికి ఈఓ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంద్రకీలాద్రిపై పని చేసే ఉద్యోగులు, సిబ్బంది ఇక నుంచి తెలుపు రంగు చొక్కా, పంచె కట్టకపోతే 200 రూపాయలు జరిమానా విధించారు. ఐడీ కార్డు లేకపోతే 100 రూపాయలు జరిమానా విధించారు. విధులకు హాజరయ్యే సిబ్బంది పంచె, ఐడీ కార్డు ధరించి రావాలని ఈఓ బ్రమరాంబ ఆదేశాలు జారీ చేశారు. మూడుసార్లు జరిమానాలు చెల్లించిన వారికి ఇంక్రిమెంట్ కట్ చేస్తామని హెచ్చరించారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు డ్రెస్ కోడ్ పాటించడం, ఐడీ కార్డు ధరించడం, బయోమెట్రిక్ హాజరుపై అధికారికంగా ఈఓ సర్క్యులర్ జారీ చేశారు.

Updated Date - 2022-05-21T17:39:10+05:30 IST