ద్వారకా తిరుమలలో పెళ్లిళ్లకు అనుమతి: ఈవో భ్రమరాంబ

ABN , First Publish Date - 2020-10-16T17:23:50+05:30 IST

ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆల యంలో కొవిడ్‌ నిబంధనలను అనుసరించి..

ద్వారకా తిరుమలలో పెళ్లిళ్లకు అనుమతి: ఈవో భ్రమరాంబ

ద్వారకా తిరుమల: ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆల యంలో కొవిడ్‌ నిబంధనలను అనుసరించి వివాహాలు, ఉపనయనాలు చేసుకో వడానికి అనుమతి ఇస్తున్నట్టు దేవస్థాన కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ తెలిపారు. గురువారం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ వివాహాలు చేసుకునే వారు కొవిడ్‌ నిబంధనలను అనుసరించి 50 శాతం మేర అనుమతి స్తామని తెలిపారు. దేవస్థానంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా కేటాయించిన ఓ షాపునకు తక్కువ అద్దె వసూలు చేస్తున్నారంటూ వచ్చిన అభ్యంతరాలపై స్పందించారు. గత నెల 30న షాపు ఖాళీ చేయించి గురువారం తిరిగి వేలం నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో ఫైనల్‌ చేస్తామని తెలిపారు. తక్కువ అద్దె చెల్లించిన వారి నుంచి ఆల యానికి నష్టం జరిగిన సొమ్మును రికవరీ చేస్తామని ఈవో చెప్పారు.

Updated Date - 2020-10-16T17:23:50+05:30 IST