ఒమన్ వెళ్లే వారికి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కీలక సూచన !

ABN , First Publish Date - 2020-11-01T12:53:07+05:30 IST

ఒమన్ వెళ్లే ప్రయాణికులకు నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తాజాగా కీలక సూచన చేసింది.

ఒమన్ వెళ్లే వారికి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కీలక సూచన !

మస్కట్: ఒమన్ వెళ్లే ప్రయాణికులకు నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తాజాగా కీలక సూచన చేసింది. వ్యాలీడ్ ఎగ్జిస్టింగ్ వీసా లేదా ఎంప్లాయిమెంట్ వీసా ఉన్న ప్రయాణికులకు మాత్రమే ఒమన్ వెళ్లే అవకాశం ఉందని ప్రకటించింది. అలాగే గడువు ముగిసిన వీసాలను రెన్యూవల్ చేసుకున్న వారు కూడా ఒమన్ ప్రయాణానికి అర్హులని పేర్కొంది. కానీ, కొత్తగా జారీ చేసిన వీసా ఉన్నవారికి మాత్రం ప్రయాణానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇక భారత్‌, ఒమన్ మధ్య కుదిరిన ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం అక్టోబర్ 1 నుంచి ఇరు దేశాల మధ్య విమానాల రాకపోకలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం గడువు నవంబర్ 30 వరకు ఉంది. కాగా, ఎయిర్ బబుల్ వల్ల రెండు దేశాల నుంచి నియమించబడిన క్యారియర్‌లకు ఇప్పుడు ఒమన్, భారతదేశం మధ్య కొన్ని షరతులతో విమాన సేవలను నిర్వహించడానికి అనుమతి లభించింది. ఇక ఈ నేపథ్యంలో ఇటీవల ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 'వందే భారత్ మిషన్' ఏడో దశలో భాగంగా మస్కట్, ఒమన్ నుంచి భారత్‌లోని న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, ముంబై నగరాలకు విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 1 నుంచి 30 వరకు ఈ విమానాలు నడవనున్నాయి.  

Updated Date - 2020-11-01T12:53:07+05:30 IST