ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

ABN , First Publish Date - 2021-04-19T06:08:39+05:30 IST

: జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలోకి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈవో తెహారా సుల్తానా తెలిపారు.

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

మచిలీపట్నం టౌన్‌  : జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలోకి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈవో తెహారా సుల్తానా తెలిపారు. గుర్తింపు పొందిన విద్యాసంస్థలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు మే 15తేదీ లోగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపవచ్చన్నారు. మరిన్ని వివరాలకు రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ ఆదర్శ పాఠశాల నెం. 7075773456, గంపలగూడెం ఆదర్శ పాఠశాల  సెల్‌ నెం.7032996467, సహాయ సంచాల కులు సెల్‌ నెం.9392063452కు ఫోను చేసి తెలుసుకోవచ్చన్నారు. 

కేయూ పరిధిలో నెలాఖరు వరకు ఆన్‌లైన్‌ తరగతులు

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 18 : జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతిగా ఉన్నందున ఏప్రిల్‌ నెలాఖరు వరకు డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వి.చంద్రశేఖర్‌ తెలిపారు. కళాశాలల్లోని అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విధిగా కళాశాలలకు హాజరు కావాలన్నారు. 

Updated Date - 2021-04-19T06:08:39+05:30 IST