టీడీపీ సభ్యత్వంతో కుటుంబానికి భరోసా

ABN , First Publish Date - 2022-07-01T07:06:12+05:30 IST

తెలుగుదేశం పార్టీలో సభ్యత్వ నమోదు అంటే.. కుటుంబానికి రక్షణ, భరోసాలాంటిదని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు.

టీడీపీ సభ్యత్వంతో కుటుంబానికి భరోసా

మాజీ మంత్రి పరిటాల సునీత 

రామగిరి, జూన 30: తెలుగుదేశం పార్టీలో సభ్యత్వ నమోదు అంటే.. కుటుంబానికి రక్షణ, భరోసాలాంటిదని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. రామగిరి టీడీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం గ్రామస్థాయి నాయకులు, కమిటీ మెంబర్లతో సమీక్ష నిర్వహించారు. సభ్యత్వ నమోదు, ఓటరు జాబితాపై చర్చించారు. కొన్ని గ్రామాల్లో సభ్యత్వ నమోదు తక్కువగా ఉండటానికి కారణాలను ఆరాతీశారు. రూ.వంద చెల్లించి పార్టీ సభ్యత్వం పొందితే రూ.2 లక్షల బీమా సౌకర్యం ఉంటుందని సునీత అన్నారు. డిజిటల్‌ మాధ్యమంలోనూ సభ్యత్వం పొందే అవకాశం ఉందని, వాట్సాప్‌, టెలిగ్రామ్‌, టీడీపీ యాప్‌ ద్వారా సభ్యత్వం పొందవచ్చని సూచించారు. గ్రామాల్లో నాయకులు బాధ్యతగా సభ్యత్వ నమోదు చేయించాలని అన్నారు. యువతను సభ్యులుగా చేర్చాలని సూచించారు. నాయకుల్లో ఉన్న విభేదాలను కార్యకర్తలపై రుద్దవద్దని, అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. బూత కన్వీనర్లుగా సరైన అభ్యర్థులను అందరూ కలిసి ఎంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రంగయ్య, మండల కన్వీనర్‌ సుధాకర్‌, ప్రధాన కార్యదర్శి మారుతి ప్రసాద్‌, మాజీ జడ్పీటీసీ రామ్మూర్తి నాయుడు, మండల ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, రైతు సంఘం మండల అధ్యక్షుడు అక్కులప్ప, మాజీ సర్పంచలు శ్రీనివాసులు, ముత్యాలు, ఓబిలేసు, ఎంపీటీసీ శ్రీనివాసులు, పేపర్‌ శీనా పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T07:06:12+05:30 IST