నిధుల వినియోగం కోసం డిజిటల్ సంతకాల నమోదు
ABN , First Publish Date - 2022-07-06T05:58:26+05:30 IST
ప్రభుత్వ నిధుల వినియోగంపై జడ్పీ చైర్మన్, సీఈవోలకు ప్రభుత్వం అధికారాలు కేటా యించారు.
సూర్యాపేట సిటీ, జూలై 5 : ప్రభుత్వ నిధుల వినియోగంపై జడ్పీ చైర్మన్, సీఈవోలకు ప్రభుత్వం అధికారాలు కేటా యించారు. దీంతో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, సీఈవో సురేష్ ఆన్లైన్లో మంగళవారం డిజిటల్ సంతకాలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో డీఎల్పీవో లక్ష్మీనారాయణ, డీపీఎం శ్రీను పాల్గొన్నారు.
సమన్వయంతో ప్రజలకు సంక్షేమ ఫలాలు : జడ్పీ చైర్పర్సన్
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయడంతో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక అన్నారు. జడ్పీ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జడ్పీ సీఈవో సురేష్, కార్యాలయ సిబ్బంది ఆమెను కార్యాలయంలో మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు పుల్లారావు, మాలోతు మోతీలాల్ పాల్గొన్నారు.