వివాదాస్పద భూమిపై విచారణ

ABN , First Publish Date - 2022-05-27T05:25:35+05:30 IST

మండలంలోని బొమ్మవరం పంచాయతీ అగ్రహారంలో వివాదాస్పదంగా ఉన్న భూమిపై ఐటీడీఏ ఏపీవో రాజ్యలక్ష్మి గురువారం విచారణ చేపట్టారు.

వివాదాస్పద భూమిపై విచారణ
గిరిజనులతో చర్చిస్తున్న ఏపీవో రాజ్యలక్ష్మి

అనంతసాగరం, మే 26: మండలంలోని బొమ్మవరం పంచాయతీ అగ్రహారంలో వివాదాస్పదంగా ఉన్న భూమిపై ఐటీడీఏ ఏపీవో రాజ్యలక్ష్మి గురువారం విచారణ చేపట్టారు. తమకు 2012లో సర్వే నెంబరు 548లో ప్రభుత్వం ఇచ్చిన భూములను గ్రామానికి చెందిన కొందరు అన్యాయంగా ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని, తమ భూములు తమకు దక్కేలా చర్యలు తీసుకోవాలని పలువురు గిరిజనులు ఇటీవల ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ భూమిని ఏపీవో రాజ్యలక్ష్మి పరిశీలించి గిరిజనుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడు భూములు ఇచ్చారు, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించిచారు. అనంతరం ఇరువర్గాలతో చర్చించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో తహసిల్ధారు శ్రీనివాసులు రెడ్డి సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-05-27T05:25:35+05:30 IST