పదో తరగతి పరీక్షలు యధాతథం: డీఈవో

ABN , First Publish Date - 2021-04-21T05:40:08+05:30 IST

పదో తరగతి పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరాం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

పదో తరగతి పరీక్షలు యధాతథం: డీఈవో

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 20: పదో తరగతి పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరాం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత ఉపాధ్యాయులు కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ అన్ని పనిదినాల్లో పాఠశాలలకు హాజరు కావాలన్నారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థును పాస్‌ చేస్తూ వారిని పైతరగతికి ప్రమోట్‌ చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. జగనన్న అమ్మఒడి పథకంలో ల్యాప్‌ట్యాప్‌ లేదా నగదు ఎంపిక వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు.


Updated Date - 2021-04-21T05:40:08+05:30 IST