ఇంగ్లిష్ మీడియంపై సీఎం జగన్‌కు రఘురామ రాజు అదిరిపోయే పంచ్

ABN , First Publish Date - 2020-10-07T19:50:23+05:30 IST

ఇంగ్లిష్ మీడియం స్కూల్స్‌పై జగన్ సర్కార్‌కు నర్సాపురం ఎంపీ రఘురామ రాజు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. బుధవారమిక్కడ రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన..

ఇంగ్లిష్ మీడియంపై సీఎం జగన్‌కు రఘురామ రాజు అదిరిపోయే పంచ్

న్యూఢిల్లీ: ఇంగ్లిష్ మీడియం స్కూల్స్‌పై జగన్ సర్కార్‌కు నర్సాపురం ఎంపీ రఘురామ రాజు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. బుధవారమిక్కడ రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ‘‘ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువుకుంటే... తనలా వృద్ధిలోకి రావొచ్చని జగన్‌ అనుకుంటున్నాడేమో?గుజరాతీ మీడియంలో చదివిన మోదీ... ప్రపంచ నాయకుడు అయ్యారన్న విషయం జగన్ గుర్తుపెట్టుకోవాలి. నచ్చిన మీడియంలో చదువుకునే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. అధికారం ఉంది కదా అని రాజ్యాంగాన్ని కూడా మారుస్తామని... వైసీపీ అనుకోవడం పొరపాటు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా జగన్‌ మీడియా తప్పుపడుతోంది. ఇంగ్లిష్‌ అవసరమే, ముందు తెలుగు నేర్పండి. ఆసక్తి ఉన్నవారు ఇంగ్లిష్‌ మీడియంలో చేరి నేర్చుకుంటారు. వారి సహజ హక్కులను హరించకండి’’ అన్నారు. 

Updated Date - 2020-10-07T19:50:23+05:30 IST