వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం: సబితా ఇంద్రా రెడ్డి

ABN , First Publish Date - 2022-03-15T01:38:43+05:30 IST

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం: సబితా ఇంద్రా రెడ్డి

హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం మాధ్యమాన్ని ప్రవేశపెడతామని విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం - ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశ పెడతామన్నారు. మొదటి దశ 363 మంది రాష్ట్ర స్థాయికి - సోర్స్ పర్సన్లకు, 2,683 మంది జిల్లా మెంటార్స్‌కి శిక్షణ ఇస్తున్నామన్నారు.  ఒక్కో విడతలో 16,500 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందన్నారు. 4 విడుతల్లో మొత్తం 81,590 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని ఆమె తెలిపారు. 

Updated Date - 2022-03-15T01:38:43+05:30 IST