నాటింగ్హామ్ టీ ట్వంటీలో భారత్ ఓటమి
ABN , First Publish Date - 2022-07-11T04:43:16+05:30 IST
మూడో టీ ట్వంటీలో భారత్ ఓటమి పాలైంది. 17 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. మొత్తం 20 ఓవర్లలో ..
నాటింగ్హామ్: మూడో టీ ట్వంటీలో భారత్ ఓటమి పాలైంది. 17 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. మొత్తం 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి టీమిండియా 198 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. 216 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరి నిరాశ పర్చారు. సూర్య కుమార్ 117 పరుగులు చేసినా ఆ తర్వాత వచ్చిన వారెవరూ నిలకడగా ఆడలేకపోవడంతో భారత్ ఓటమి పాలైంది. అయితే 2-1 తేడాతో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది.