పెట్రోల్, డీజిల్ రవాణా కోసం మిలటరీని దించబోతున్న England

ABN , First Publish Date - 2021-10-03T08:14:57+05:30 IST

పెట్రోల్, డీజిల్ తరలించేందుకు ఇంగ్లండ్ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఏకంగా మిలటరీని దించేందుకు సిద్ధమైంది. దీనికోసం దాదాపు 200 మిలటరీ..

పెట్రోల్, డీజిల్ రవాణా కోసం మిలటరీని దించబోతున్న England

లండన్: పెట్రోల్, డీజిల్ తరలించేందుకు ఇంగ్లండ్ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఏకంగా మిలటరీని దించేందుకు సిద్ధమైంది. దీనికోసం దాదాపు 200 మిలటరీ ట్యాంక్ సిబ్బందిని రంగంలోకి దించబోతోంది. సోమవారం వీరంతా పని ప్రారంభించబోతున్నారు. మొత్తం సిబ్బందిలో కొందరు డ్రైవర్లుగా ఇంధన ట్యాంకర్లను తరలించనుండగా, మిగతా వారు ఆ ట్యాకులు నిర్దిష్ట గమ్యానికి చేరేవరకు భద్రత కల్పించనున్నట్లు ఇంగ్లండ్ ప్రభుత్వం ప్రకటించింది.


 ‘దేశంలో నెలకొన్న ఇంధన కొరత గత వారం రోజులుగా తగ్గుతోంది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే పరిస్థితులు చక్కబడ్డాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఆందోళనకర పరిస్థితులే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజా నిర్ణయం తీసుకున్నాం’ అని వెల్లడించింది. అయితే పెట్రోల్, డీజిల్ విక్రయించే దుకాణాల వారు మాత్ర ఇప్పటికీ అత్యధిక ప్రాంతాల్లో ఇంధన కొరత ఉందని, శుక్రవారం కూడా ఈ కొరత కొనసాగిందని చెబుతున్నారు. 

Updated Date - 2021-10-03T08:14:57+05:30 IST