England vs India: టాస్ గెలిచిన ఇంగ్లండ్
ABN , First Publish Date - 2022-07-01T20:26:16+05:30 IST
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మరికాసేపట్లో చివరిదైన ఐదో టెస్టు (రీ షెడ్యూల్డ్ టెస్ట్) ప్రారంభం కానుంది
బర్మింగ్హామ్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మరికాసేపట్లో చివరిదైన ఐదో టెస్టు (రీ షెడ్యూల్డ్ టెస్ట్) ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్స్టోక్ (Ben Stokes) భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఎడ్జ్బాస్టన్ (Edgbaston)లో జరగనున్న ఈ మ్యాచ్లో టీమిండియాకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) సారథ్యం వహించనున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) అతడికి డిప్యూటీగా వ్యవహరిస్తాడు. ఈ సిరీస్లో భారత్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు, ఈ మ్యాచ్లో నెగ్గి సిరీస్ను సమం చేయాలని ఇంగ్లిష్ జట్టు గట్టి పట్టుదలగా ఉంది.
కరోనా కారణంగా రోహిత్ శర్మ (Rohit Sharma) జట్టుకు దూరం కావడంతో అందివచ్చిన కెప్టెన్సీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బుమ్రా భావిస్తున్నాడు. ఇంకోవైపు, ఈ మ్యాచ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి కీలకం కానుంది. గత కొంతకాలంగా పేలవ ఫామ్తో ఇబ్బందులు పడుతున్న కోహ్లీ ఈ మ్యాచ్తో తిరిగి సత్తా చాటాలని భావిస్తున్నాడు. అభిమానులూ అదే కోరుకుంటున్నారు.
భారత జట్టు: శుభమన్గిల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్)
ఇంగ్లండ్ జట్టు: అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), శామ్ బిల్లింగ్స్, మాటీ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్