రూట్ 180.. ఇంగ్లండ్ 391 ఆలౌట్
ABN , First Publish Date - 2021-08-15T07:00:37+05:30 IST
నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో ఇంగ్లండ్ గట్టి పోటీ ఇస్తోంది. తొలి టెస్టులో..
లండన్: నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో ఇంగ్లండ్ గట్టి పోటీ ఇస్తోంది. తొలి టెస్టులో వరుణుడి అండతో ఓటమి నుంచి గట్టెక్కిన ఇంగ్లీష్ జట్టు.. రెండో టెస్టులో మాత్రం ఆ తరహా ఓటమి చవిచూడకూడదని పట్టుదలగా ఆడుతోంది. ఈ క్రమంలోనే మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు 391 పరుగులకు ఆలౌట్ అయి.. భారత్పై 27 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్(180 నాటౌట్) డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.
భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీసి రాణించాడు. ఇశాంత్ శర్మ 3, మహ్మద్ షమి 2 వికెట్లు తీశారు. రేపు నాలుగో రోజు భారత్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.