మరో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. ఈసారి Hardik Pandya వంతు

ABN , First Publish Date - 2022-07-17T22:29:11+05:30 IST

భారత్‌తో జరుగుతున్న సిరీస్ నిర్ణాయక మ్యాచ్‌లో ఇంగ్లండ్ తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లండ్ 74

మరో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. ఈసారి Hardik Pandya వంతు

మాంచెస్టర్: భారత్‌తో జరుగుతున్న సిరీస్ నిర్ణాయక మ్యాచ్‌లో ఇంగ్లండ్ తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లండ్ 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బెయిర్‌స్టో, జో రూట్‌ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. వీరిద్దరినీ సిరాజ్ పెవిలియన్ పంపాడు.


ఆ తర్వాత క్రీజులో కుదురున్న జాసన్ రాయ్ (41)ని పాండ్యా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత కాసేపటికే బెన్‌స్టోక్స్ (27)ను కూడా పాండ్యా పెవిలియన్ పంపాడు. దీంతో ఆతిథ్య జట్టు 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిశాయి. ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. జోస్ బట్లర్, మొయిన్ అలీ క్రీజులో ఉన్నారు.

Updated Date - 2022-07-17T22:29:11+05:30 IST