నిర్ణయాధికారం కార్తీక్‌దే..నా జోక్యం ఉండదు: ఇయాన్ మోర్గాన్

ABN , First Publish Date - 2020-08-01T20:41:48+05:30 IST

భారత అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూన్న ఐపీఎల్-2020 సెప్టెంబరు 19 నుంచి యూఏఈలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలోని కేకేఆర్..

నిర్ణయాధికారం కార్తీక్‌దే..నా జోక్యం ఉండదు: ఇయాన్ మోర్గాన్

లండన్: భారత అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-2020 సెప్టెంబరు 19 నుంచి యూఏఈలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలోని కేకేఆర్ (కోల్‌కత నైట్‌రైడర్స్) జట్టుకు దినేశ్ కార్తీక్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఇంగ్లాండ్‌కు ప్రపంచ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్‌ను కూడా కేకేఆర్ ఫ్రాంచైజీ ఈ ఏడాది కొనుగోలు చేసింది. దీంతో జట్టు కెప్టెన్ బాధ్యతలు ఎవరు నిర్వహిస్తారనే విషయంలో అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో మోర్గాన్ మాట్లాడుతూ, కెప్టెన్సీతో తనకు సంబంధం లేదని, ఆ బాధ్యతలు కార్తీక్ మాత్రమే చూసుకుంటాడని తెలిపాడు. ‘కెప్టెన్సీకి సంబంధించి మా ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. అందువల్ల మైదానంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో నేను జోక్యం చేసుకోను. కార్తిక్ సూచనలను మాత్రమే పాటిస్తాన’ని మోర్గాన్ పేర్కొన్నాడు.

Updated Date - 2020-08-01T20:41:48+05:30 IST