England vs India: ముగిసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్.. 284 పరుగులకు ఆలౌట్
ABN , First Publish Date - 2022-07-04T01:16:32+05:30 IST
భారత్తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 284 పరుగుల వద్ద ముగిసింది. దీంతో
బర్మింగ్హామ్: భారత్తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 284 పరుగుల వద్ద ముగిసింది. దీంతో భారత్కు 132 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్నైట్ స్కోరు 84/5తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ కొద్దిగా పోరాడినప్పటికీ పూర్తిస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది. నేటి ఆటలో జానీ బెయిర్స్టో సెంచరీ చేయడం ఒక్కటే నేటి ఆటలో చెప్పుకోదగ్గ అంశం. 119 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో టెస్టుల్లో భారత్పై అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన బెయిర్స్టో 106 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.
స్టోక్స్ 25, శామ్ బిల్లింగ్స్ 36, మాటీ ప్యాట్స్ 19 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్ 4, బుమ్రా 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ శుభమన్ గిల్ (4) అవుటయ్యాడు. ప్రస్తుతం చతేశ్వర్ పుజారా, హనుమ విహారి క్రీజులో ఉన్నారు.