గుండెపోటుతో ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2021-04-21T05:36:04+05:30 IST

మండలంలోని ఆర్‌జీఎం కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న ఈసీఈ విద్యార్థి నాగరాకేష్‌ (20) గుండెపోటుతో మృతి చెందినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది.

గుండెపోటుతో ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

పాణ్యం, ఏప్రిల్‌ 20: మండలంలోని ఆర్‌జీఎం కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న ఈసీఈ విద్యార్థి నాగరాకేష్‌ (20) గుండెపోటుతో మృతి చెందినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. మంగళవారం కళాశాలలో ఛాతీలో నొప్పిరావడంతో  శాంతిరాం ఆసుపత్రికి తరలించారన్నారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. విద్యార్థి ఆస్పరి మండలానికి చెందినవాడని తెలిపారు. విద్యార్థి మృతి పట్ల యాజమాన్యం, ఉపాధ్యాయులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కళాశాలకు సెలవు ప్రకటించారు. 

Updated Date - 2021-04-21T05:36:04+05:30 IST