ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-02-01T02:44:37+05:30 IST

జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం పెడతాడేపల్లిలోని శ్రీ వాసవి ఇంజినీరింగ్

ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

పశ్చిమ గోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం పెడతాడేపల్లిలోని శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళానికి చెందిన అల్లంశెట్టి రవితేజ (19) బీటెక్ మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. హాస్టల్ గదిలో ఉరివేసుకుని మృతి చెందాడు. చనిపోయేముందు "మీ అందరికి సర్ప్రైజ్, నేను చనిపోతున్నా" అని స్నేహితుడికి వాట్సాప్ ద్వారా సందేశాన్ని రవితేజ పంపాడు. కాలేజీకి రూరల్ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-02-01T02:44:37+05:30 IST