సెప్టెంబరు 15 నుంచి ఇంజనీరింగ్‌ తరగతులు

ABN , First Publish Date - 2021-05-07T09:52:05+05:30 IST

ఇంజనీరింగ్‌తో పాటు ఇతర సాంకేతిక కోర్సులు అందిస్తున్న కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల షెడ్యూల్‌ను అఖిల భారత

సెప్టెంబరు 15 నుంచి ఇంజనీరింగ్‌ తరగతులు

ఆగస్టు-31లోపు తొలివిడత కౌన్సెలింగ్‌ పూర్తి 

ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల చేసిన ఏఐసీటీఈ 


హైదరాబాద్‌, మే 6(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌తో పాటు ఇతర సాంకేతిక కోర్సులు అందిస్తున్న కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల షెడ్యూల్‌ను అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గురువారం విడుదల చేసింది. జూన్‌-30లోపు కాలేజీలు గుర్తింపు ప్రక్రియలను పూర్తి చేయాలని, ఆగస్టు-31లోపు మొదటి విడత కౌన్సెలింగ్‌, సెప్టెంబరు-9లోపు రెండోవిడత కౌన్సెలింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించింది. సెప్టెంబరు-15 నుంచి ప్రథమ సంవత్సరం ప్రవేశాలు, సెప్టెంబరు-20 నుంచి నేరుగా రెండో ఏడాది ప్రవేశాలు పొందిన విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని కోరింది. ఈ మేరకు ఏఐసీటీఈ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల చేశారు.


ఇంజనీరింగ్‌, ఫార్మసీ కాలేజీల్లో ఫీజుల వసూలు, బోధనా సిబ్బంది తొలగింపుపై పెద్దఎత్తున వస్తున్న ఫిర్యాదులపై ఏఐసీటీఈ ఎట్టకేలకు స్పందించింది. ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేయవద్దని కళాశాలలు, విశ్వవిద్యాలయాలను కోరింది. మొత్తం ఫీజు ను ఒకేసారి కాకుండా 3-4 విడతల్లో చెల్లించే వెసులుబాటు విద్యార్థులకు కల్పించాలని కోరింది.   

Updated Date - 2021-05-07T09:52:05+05:30 IST