ముగిసిన తెలంగాణ పీజీఈసెట్
ABN , First Publish Date - 2020-09-25T07:29:34+05:30 IST
తెలంగాణ పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు(టీఎ్స-పీజీఈసెట్), ఫార్మ్-డీ ఎంట్రెన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పీజీ
ఉప్పల్, సెప్టెంబర్24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు(టీఎ్స-పీజీఈసెట్), ఫార్మ్-డీ ఎంట్రెన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పీజీ ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ కోర్సులతోపాటు ఫార్మ్-డీలో చేరేందుకు 19 సబ్జెక్టులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 21 నుంచి 24 వరకు 22 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ ఎంట్రెన్స్కు 75.43 శాతం హాజరయ్యారు. ఈ ఎంట్రెన్సులు రాసేందుకు మొత్తం 22,282 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 16,807 మంది హాజరైనట్లు పీజీ ఈసెట్ కన్వీనర్, ఓయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్.కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.