స్వల్ప లాభాలతో ముగింపు

ABN , First Publish Date - 2021-04-17T06:40:39+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 28.35 పాయింట్ల స్వల్ప లాభంతో 48,832.03 వద్ద ముగియగా నిఫ్టీ 36.40 పాయింట్ల లాభంతో 14,617.85 వద్ద ముగిసింది.

స్వల్ప లాభాలతో ముగింపు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 28.35 పాయింట్ల స్వల్ప లాభంతో 48,832.03 వద్ద ముగియగా నిఫ్టీ 36.40 పాయింట్ల లాభంతో 14,617.85 వద్ద ముగిసింది. విస్తరిస్తున్న కొవిడ్‌ కేసులతో మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. అయితే వారం మొత్తానికి చూస్తే మాత్రం సెన్సెక్స్‌ 759.29 పాయింట్లు, నిఫ్టీ 217 పాయింట్లు నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మార కం రేటు పుంజుకోవడం, ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం శుక్రవారం భారత మార్కెట్‌ను ముందు కు నడిపించాయి. 


విప్రో షేరు దూకుడు: నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో విప్రో షేరు శుక్రవారం దూసుకుపోయింది. బీఎ్‌సఈలో ఒక దశలో కంపెనీ షేరు 9.86 శాతం లాభంతో రూ.473.50కి చేరటంతో 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరికి 8.87 శాతం లాభంతో రూ.469.25 వద్ద ముగిసింది. దీంతో శుక్రవారం ఒక్కరోజే విప్రో మార్కెట్‌ విలువ (మార్కెట్‌ క్యాప్‌) రూ.10,777.70 కోట్లు పెరిగి రూ.2.57 లక్షల కోట్లకు చేరింది. 

Updated Date - 2021-04-17T06:40:39+05:30 IST