కోమటివానిచెరువు ఆక్రమణలు తొలగించాలి
ABN , First Publish Date - 2022-09-27T05:02:19+05:30 IST
కోమటివానిచెరువు ఆక్రమణలను తొలగిం చాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశా రు.
మదనపల్లె అర్బన్, సెప్టెంబరు 26: కోమటివానిచెరువు ఆక్రమణలను తొలగిం చాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశా రు. సోమవారం కోమటివాని చెరువు వద్ద సీపీఐ నాయకులు చెరువును సర్వే నిర్వ హించి, ఆక్రమణలను లొలగించాని నిరస న కరర్యాక్రమం చేపట్టారు. మదనపల్లెలో మీనీ ట్యాంక్ బండగా చెప్పుకుంటున్న చెరువును కొంతమంది ఆక్రమించారన్నారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మా ట్లాడుతూ ఈ ఆక్రమణలపై పలుమారులు నిరసన, ధర్నాలు చేపట్టామని, సబ్క లెక్టర్కు వినతిచేశామని అయినప్పటికీ చెరువు ఆక్రమనలు ఆగలేదని వాపోయారు. కోట్లు విలువ చేసే ఆక్రమణలను అరికట్టాలని ఉన్నత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణప్ప, పట్టణ కార్యదర్శి మురళి, దేవ, తిరుమల, రెడ్డెప్ప నాగరాజ, రవి, బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.